మహిళా కడుపులోంచి 4.5 కిలోల కణతిని తొలగించిన డా

ఎల్లారెడ్డి 9 జూలై జనంసాక్షి (టౌన్)
కడుపు నొప్పితో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన ఓ మహిళకు ఆపరేషన్ చేసి 4.5 కిలోల కనతి తొలగించారు డాక్టర్ రవీంద్ర మోహన్. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 3 తారీకు కడుపునొప్పితో బాధపడుతూ మండలం లాడేగాం కు చెందిన బాలమణి అనే మహిళ ఎల్లారెడ్డి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రావడం జరిగిందని,ఆమె కొంతకాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు తెలపడంతో స్కానింగ్ తీసి ఆమె కడుపులో (ఒవేరియన్ ట్యూమర్) ఉన్నట్లు గుర్తించి  శుక్రవారం నాడు సాయంత్రం ఆపరేషన్ చేసి ఆమె కడుపులో ఉన్న కణతి ని తొలగించామన్నారు. ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందన్నారు