మహిళ దారుణ హత్య

పెట్రోల్‌ పోసి తగులబెట్టిన దుండగులు
వికారాబాద్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) : పరిగి మండలం రంగంపల్లి గేటు సవిూపంలో దారుణం జరిగింది. పరిగి – కొడంగల్‌ ప్రధాన రహదారి పక్కన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. మహిళ శవాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పరిశీలించారు. మహిళ వయస్సు దాదాపు 22-25 మధ్య ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మహిళను గుర్తించలేని స్థితిలో ఆమెను దుండగులు తగులబెట్టారు. ఈ ఘటన గత రాత్రి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.