మాజీ ప్రధానికి సుప్రీంలో ఊరట

ఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సుప్రీం కోర్టు ఊరట లభించింది. బొగ్గు స్కాంలో కేసులో మన్మోహన్ ను ప్రశ్నించాలన్న సీబీఐ నోటీసుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ మేరకు సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.