మానవత్వం చాటుకున్న పోలీసులు

రాయికల్, అక్టోబర్ 27 (జనంసాక్షి) రాయికల్ మండలం వస్తాపూర్ గ్రామానికి చెందిన సంకే చిన్న భూమయ్య రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు తన ఇంట్లో సజీవ దహనం కాగా మృతుని కుటుంబానికి పోలీసులు గురువారం నిత్యవసర వస్తువులను అందజేశారు. పోలీస్ సంస్కరణ దినోత్సవాలను పురస్కరించుకొని రాయికల్ ఎస్సై అజయ్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి 50 కేజీల బియ్యం, నిత్యవసర వస్తువులను అందించారు. మండల ప్రజలు తమకు తోచిన విధంగా వారికి సహాయం అందించాలని కోరడం జరిగింది.