మానవత్వాన్ని చాటుకున్న బిజెపి అభ్యర్థి సునీల్ రెడ్డి

మానవత్వాన్ని చాటుకున్న బిజెపి అభ్యర్థి సునీల్ రెడ్డి

మంథని, (జనంసాక్షి) : మంథని బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల సునీల్ రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. గురువారం ఉదయం రామగిరి మండలంలోని మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారి రాజాపూర్ వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొనగా ఎన్నికల ప్రచారం నిమిత్తం అటువైపు వెళుతున్న సునీల్ రెడ్డి రోడ్డు పైన తీవ్ర గాయాలైన నలుగురిని చూసి తన వాహనం అపి వారికి ధైర్యం చెప్పి తన వాహనంలో ఎక్కించి మంథని హాస్పిటల్ కు తరలించారు. ఎన్నికల సమయంలో ముందుగా ఇచ్చిన బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ గాయాలతో బాధపడుతున్న వారిని చూసి చలించి మానవత్వం చాటుకున్న సునీల్ రెడ్డిని పలువురు అభిస్తున్నారు