మానవపాడు లో జాతీయ జెండాలతో ర్యాలీ

మానవపాడు, ఆగస్టు 13 (జనం సాక్షి): 75వ స్వతంత్ర వజ్రోత్సవాల శుభ సందర్భంగా మానవపాడు మండలం, అమరవాయి గ్రామంలో జాతీయ జెండా చేత పట్టుకొని స్వతంత్ర సమరయోధులను గుర్తు చేసుకుని విద్యార్థిని, విద్యార్థులు యువతీ యువకులు గ్రామ ప్రజలు నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ఎస్సై సంతోష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అమరవాయి నుండి మానవపాడు, చెన్నిపాడు, పోతులపాడు బస్టాండ్ వివిధ గ్రామాలలో వీధులలో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సై సంతోష్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం వచ్చిందని జాతీయ నాయకులను మనం స్మరించుకోవాలని అన్నారు. ఈ నెల 8 నుండి 22 వరకు జరిగే వజ్రోత్సవాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎస్ఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి. హుస్సేన్, అమరవాయి శంకర్ గౌడ్, గొల్ల వెంకటరాముడు, షాకీర్, జగ్గుల ప్రభాకర్, జగుల ప్రసాద్, వివిధ గ్రామాల ప్రజలు విద్యార్థులు, పోలీస్ సిబ్బంది కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.