మామ, భర్త మరణాలపై అనుమానాలు

ఆడపడుచులు వారి భర్తల పై అనుమానం.
– బెదిరింపులకు గురి చేస్తున్న పట్టణ విలేకరి
– పోలీసులు పూర్తి విచారణ జరపాలని బాధితురాలు మాధురి ఆవేదన

 

రామకృష్ణాపపూర్, (జనంసాక్షి) : తన భర్త, మామ మరణాలపై అనుమానం ఉందని మర్రిపల్లి మాధురి తెలియజేశారు. సోమవారం రామకృష్ణాపూర్ పట్టణం క్యాతన్ పల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన భర్త చావుపై పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, సరైన విచారణ జరగలేదని, మామ చనిపోయిన సమయంలో పోస్టుమార్టం చేపించాలని అడిగినప్పటికీ తన ఆడబిడ్డలు వారి భర్తలు నిరాకరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త పోస్టుమార్టం రిపోర్ట్ కూడా అనుమానం రాకుండా డబ్బులు ఖర్చు చేసి మార్పిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన మామ పదవి విరమణ పొందిన అనంతరం వచ్చిన సింగరేణి డబ్బులు మొత్తం ఆడబిడ్డలు వాడుకున్నారని, వారికి అండగా రామకృష్ణాపూర్ రిపోర్టర్ రామిళ్ళ శ్రీనివాస్ నిలబడి తనను వేధింపులకు గురి చేసినట్లు తెలిపారు. డబ్బులు వారి సొంతానికి వాడుకున్నారని అన్నారు. తన కుటుంబం నుండి తనను దూరం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ప్రాణాలు తీస్తానని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ సమావేశంలో తమ గోడును వెళ్ళపుచ్చారు. దీనికి పూర్తి బాధ్యతలు తన ఆడపడుచులు వారి భర్తలతో పాటుగా రామకృష్ణాపూర్ విలేఖరి రామిల్ల శ్రీనివాస్ బాధ్యత వహించాలని తెలియజేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ తగు చొరవ తీసుకొని తన భర్త, మామ మరణాల పట్ల తగు విచారణ జరిపి తమకు పూర్తి న్యాయం చేయాలని వేడుకున్నారు.