మార్కండేయ ఆలయం సందర్శించిన మంత్రి కేటీఆర్.

రాజన్న సిరిసిల్లబ్యూరో. అక్టోబర్ 27. (జనంసాక్షి). సిరిసిల్ల పట్టణంలోని నిర్మాణంలో ఉన్న మార్కండేయ ఆలయాన్ని పద్మశాలి సంఘం నాయకులు కౌన్సిలర్లతో కలిసి మంత్రి కేటీఆర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఆలయం నిర్మాణానికి అవసరమైన చొరవ తీసుకోవాలని పద్మశాలి సంఘం నాయకులు కోరారు. ఆలయం త్వరగా పూర్తి అయ్యేందుకు కావలసిన సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు బోల్లి రామ్మోహన్, మండల సత్యం, పలువురు పద్మశాలి సంఘం నాయకులు కౌన్సిలర్లు పాల్గొన్నారు