మా సర్కారే రైతుల పక్షపాతి

` సన్న ధాన్యం ప్రోత్సాహం కోసమే రూ.500 బోనస్‌
` బీఆర్‌ఎస్‌ అబద్దాల ప్రచారం మానాలి
` గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా కొనుగోళ్లు చేస్తున్నాం
` ఆనాడు వరికుప్పలపైనే రైతులు ప్రాణాలొదిలారు
` ఇప్పుడు ధైర్యంగా పంటలు అమ్ముకుంటున్నారు
` ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు లేకుండా రైతులకు మద్దతు
` వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
హైదరాబాద్‌(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్‌ పాలనలో వ్యవసాయం, ధాన్యం సేకరణ వేయి పాళ్లునయమని, ఇది తెలంగాణ రైతుల అభిప్రాయం అనివ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలియజేసారు. గతంతో పోలిస్తే ముందస్తుగానే కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసామని, చురుకుగా కొనుగోళ్లు సాగుతున్నాయని అన్నారు. తెలంగాణలో సన్న వడ్ల సాగును పెంచేందుకు 500 బోనస్‌ ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో దొడ్డు వడ్లు తినడం చాలా తగ్గిపోయింది. గత ప్రభుత్వంలో సన్న బియ్యం పేరుతోటి దొడ్డు వడ్లనే పాలిష్‌ చేసి అంగన్వాడీలకు, మధ్యాహ్న భోజన పథకానికి వినియోగించేవారు. అలా కాకుండా పేదలు కూడా పెద్దోళ్లు తినే సన్న బియ్యం తినాలనే సంకల్పంతో రేషన్‌ దుకాణాల్లో కూడా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుంది. కానీ ఇతర రాష్టాల్ర నుంచి సన్నబియాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇకపోతే ఐకేపీ సెంటర్ల పెంపు గత ఏడాదితో పోలిస్తే నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అదనంగా కొనుగోలు చేసామని, ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు జిల్లాకొక ఐఏఎస్‌ ను నియమించి ఎప్పటికప్పుడు సవిూక్ష చేయిస్తున్నా మన్నారు. తరుగు, తాలు పేరుతో కోతలు లేవు.. గతంలో ప్రతి క్వింటాకు 7 నుంచి 10 కేజీల వరకు తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీ.. ఈ దఫా మిల్లర్ల దోపిడీ పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో కోతలకు మిల్లర్ల స్వస్తి చెప్పారని అన్నారు. దీంతో ప్రతి కింటా పై రైతుకు 150 నుంచి 200 రూపాయల వరకు అదనపు లబ్ది చేకూర్చామన్నారు. రైతులు పంట అమ్ముకున్న ఐదు రోజుల్లోనే రైతుల ఖాతాల్లోకి నగదు జమ అవుతోందని, గతంలో 45 రోజులు పెట్టేదన్నారు. రైతు ఎంతో వడ్డీ నష్ట పోయేవాడు. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లోనే రైతు ఖాతాల్లో నగదు జమ అవుతుంది దీంతో రైతుకు వడ్డీ వ్యాపారుల వేధింపులు లేవు. వడ్డీలు కట్టాల్సిన అవసరం లేదు. ఆత్మగౌరవంతో ఇప్పుడు రైతు బతుకుతున్నాడని, కేసీఆర్‌ ప్రభుత్వంలో ఫసల్‌ బీమా యోజన లేదు. ఉంటే కనీసం పంట నష్టపరిహారం వచ్చేదన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్‌, రైతు ప్రభుత్వం కాబట్టి పంట నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారాన్ని కూడా కాంగ్రెస్‌ పార్టీ అందిస్తోందన్నారు. అంతే గాక, ఇక ముందు ఏ ఒక్క రైతు కూడా ఇలా నష్టపోకుండా, ప్రభుత్వమే రైతుల ప్రీమియం చెల్లించి పంట భీమా పథకాన్ని 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి వానాకాలం నుండి అమలు చేస్తున్నామన్నారు. అలాగే తడిచిన ధాన్యాన్ని సైతం ఈ ప్రభుత్వం సేకరిస్తుంది. గతంలో కల్లాల్లో వరికుప్పలవిూద రైతులు గుండె పగిలి చనిపోయారు. కానీ మాది రైతు ప్రభుత్వం అని తెలిసి రైతులు గుండె ధైర్యంతో బతుకుతున్నారు. అందుకే మనం దొడ్డు వడ్లు అమ్ముకొనుడెంది, సన్న వడ్లు కొనుక్కునుడేంది.. మనమే మనకు అవసరమైనంత సన్న వడ్లను ఉత్పత్తి చేసుకునేందుకు ఈ బోనస్‌ పథకాన్ని ప్రవేశపెట్టాము. నాట్లేసుకునే సమయం దగ్గర పడుతుంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ స్కీమును ప్రవేశపెట్టాం. భవిష్యత్తులో దొడ్డు వడ్లకు కూడా ఈ స్కీములు వర్తింప చేస్తాము. దొడ్డు వడ్లకు 500 రూపాయలు ఇప్పుడు ఇవ్వలేకపోయినా?మూడు నుంచి ఐదు రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తూ, మిల్లర్ల ధాన్యం కోతను అరికడుతూ.. ప్రత్యక్షంగా అంతమేరా రైతుకు ఈ ప్రభుత్వం లబ్ది చేకూరుస్తోంది. అది తెలుసు కనుకనే తెలంగాణ రైతులు నిశ్చింతగా ఉన్నారు. రైతులను కాల్చుకుతిన్న టిఆర్‌ఎస్‌ అగ్ర నాయకులు ఇప్పుడు రైతుల పేర నాటకాలు ఆడుతున్నారు. సన్న వడ్లకు బోనస్‌ ఇస్తామని 2020లో కెసిఆర్‌ ప్రకటించారు. ఆ తర్వాత మూడేళ్లు అధికారంలో ఉన్న నయా పైసా బోనస్‌ ఇయ్యలేదు అందుకే కేసిఆర్‌ ను ఓడగొట్టి రైతులు ఇంట్లో కూర్చోబెట్టారు. అన్నదాతలార ఆలోచించండి..ఇది ప్రజా ప్రభుత్వం. ఎక్కడ దుబార చేయకుండా.. కెసిఆర్‌ అస్తవ్యస్థం చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం. త్వరలో అన్ని హావిూలను నిలబెట్టుకుంటాం. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హావిూల అమలు పక్రియను ప్రారంభిస్తామని చెప్పాము. ప్రారంభించి చూపించాం. వచ్చే ఎన్నికల నాటికి అన్ని హావిూలను పూర్తి చేసి తీరుతాం. లేకుంటే ఓట్లే అడగం, ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ నాయకులు తమ తప్పుడు ప్రకటనలు ఆపుకోవాలని తుమ్మల నాగేశ్వర రావు హితవు పలికారు.