ముఖ్యమంత్రి కేసిఆర్ ఫ్లెక్సీకి రాఖీ కట్టిన ,మహిళలు విద్యార్థులు

మల్దకల్ ఆగస్టు 12 (జనంసాక్షి) తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు
గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశానుసారం,మల్దకల్ మండల కేంద్రంలో రక్షాబంధన్ సందర్భంగా వైస్ ఎంపీపీ వీరన్న,మండలటిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటన్న ఆధ్వర్యంలో గురువారం
టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగంనాగర్ దొడ్డి ఎంపీటీసీ సరోజమ్మ ,కెసిఆర్ ఫ్లెక్సీ కి రాఖీ కట్టే కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో
తెరాస పార్టీ నాయకులు అజయ్, నరసింహారెడ్డి, సింగిల్విండో వైస్ చైర్మన్ విష్ణు, కో ఆప్షన్ నెంబర్ హైదర్,తెరాస పార్టీ మండల యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, తెరాస పార్టీ నాయకులు ప్రభాకర్, భాస్కర్ గౌడ్, మహేష్,తిమ్మప్ప, విద్యార్థులు,మహిళలు,తెరాస పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.