ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా బహిరంగ సభ స్థలాన్ని, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రితిరాజ్.

ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా బహిరంగ సభ స్థలాన్ని, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ రితిరాజ్

గద్వాల నడిగడ్డ, నవంబర్ 3 జనం సాక్షి.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 6న జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐజ రోడ్ లో ఉన్నా మార్కెట్ యార్డ్ వెనుకాల ఆవరణలో నిర్వహించే భహిరంగ సభ స్థలాన్ని , వాహనాల పార్కింగ్ ప్రదేశాలను జిల్లా ఎస్పీ రితిరాజ్ పరిశీలించారు. ముఖ్య మంత్రి కాన్వాయ్ రూట్ మ్యాప్ ను,సభాస్థలి ప్రాంగణం, గ్యాలరీల ఏర్పాటుల ప్రదేశాలను పరిశీలించడమైనది.
బందోస్తు సంబంధించి పోలీస్ అధికారులకు పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్య మంత్రి పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ట్రాఫిక్ డైవర్షన్ చేయాలని, విధుల్లో ఉన్న పోలీసు అధికారుల సిబ్బంది సంయమానం పాటించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి పర్యటన సజావుగా అయ్యేటట్లు చూడాలని పోలీసు అధికారులకు తెలిపారు. ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ ఎన్.రవి, డి.ఎస్పి వెంకటేశ్వర్లు, సాయుధ దళ డి . ఎస్పీ ఇమ్మనియోల్,గద్వాల సి. ఐ శ్రీనివాస్, పట్టణం ఎస్సై లు శ్రీ కాంత్ , షుకూర్ లు ఉన్నారు.