ముగిసిన స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమం

ఏటూరునాగారం, సెప్టెంబర్ 11(జనంసాక్షి):-

ఏటూరునాగారంలోని టి. టి.డబ్ల్యూ. ఆర్.జె.సి లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ గురుకుల్ ముగింపు  కార్యక్రమానికి  జడ్పీ కో -ఆప్షన్ వలీయబీ సలీమ్, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొని వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి  గురుకులాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారని వాటిని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుతూ ఈ స్వచ్ఛ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరడం జరిగింది. తరగతి గదులను ప్రాంగణాన్ని  పరిశీలించి మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులను బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ వసుంధర, వైస్ ప్రిన్సిపాల్, టీచింగ్ నాన్-టీచింగ్ స్టాప్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.
Attachments area