మున్నూరు కాపు రాష్ట్ర జర్నలిస్టుల ప్లీనరీనికి తరలిరండి.

– నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గుమ్ముల అశోక్
నిర్మల్ బ్యూరో ఆగస్ట్ 30(జనం సాక్షి):  తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్టుల ప్రథమ ప్లీనరీ సమావేశాన్ని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో ఫంక్షన్ హాల్ లో సెప్టెంబర్ 4వ తేదీన నిర్వహిస్తున్నామని మున్నూరుకాపు జర్నలిస్ట్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు గుమ్ముల అశోక్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని జడ్పి కార్యాలయ ఆవరణలో ప్లీనరీ ఆహ్వాన పత్రికలు విడుదల చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అథితులుగా
 రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, బాజాప రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్,రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్, వి.హనుమంతరావు లతోపాటు రాష్ట్రంలోని వివిధ హోదాలో ఉన్న మున్నూరు కాపు ప్రముఖులు హజరవుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 4 న నిర్వహించనున్న ఫ్లినరికి  జిల్లాలోని మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం కార్యవర్గంతో పాటు జర్నలిస్టు సోదరులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఫ్లినరి విజయవంతం చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో జర్నలిస్ట్ ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షులు రాం మహేష్, గౌరవ సబ్యులు కొండూరు రవీందర్,ఉపాధ్యక్షుడు గాండ్ల రాజశేఖర్,జిల్లా కోశాధికారి పుప్పాల శేఖర్, కార్యదర్శులు డి ఎస్ మధు,పెంట రంజిత్ కుమార్,  కూన రాజ్ కుమార్,తదితరులు పాల్గొన్నారు