మూడో రోజు చేరినవీఆర్ఏల సమ్మె

మల్దకల్ జూలై 27 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ మండల వీఆర్ఏలు బుధవారం తహశీల్దార్ కార్యాలయం ముందు సమ్మె మూడో రోజు కొనసాగిస్తున్నారు. బహుజన సమాజ్ పార్టీ మండల కన్వీనర్ గోకారివీవీఆర్ఏలకు సంఘీభావంతెలిపారు.ఈ సందర్భంగా యూనియన్ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ తమ డిమాండ్ లను అమలు చేసే వరకూ సమ్మె కొనసాగిస్తామనిఆయన అన్నారు,అర్హత కలిగిన వీఆర్ఏలకు వెంటనే పదోన్నతులు ఇవ్వాలి,వి ఆర్ ఏ లకు వెంటనే పే స్కేలు ఇవ్వాలి,వీఆర్ఏ మండల అధ్యక్షుడు పుర్ర లక్ష్మన్న ఉపాధ్యక్షుడు నరింహులు,కార్యదర్శి వెంకటేష్ ఆయా గ్రామాల వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.