*మృతి చెందిన లారీ డ్రైవర్ కుటుంబానికి ఆర్థికంగా చేయూత*

మునగాల, సెప్టెంబర్ 14(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ షేక్ పాషా గత కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందిన విషయం విదితమే. అయితే డ్రైవర్ కుటుంబానికి తోటి మైహోమ్ సిమెంట్స్ లారీ డ్రైవర్లు మృతుని కుటుంబానికి 32వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందించారు. ఈ కార్యక్రమంలో మైహోమ్ లారీ డ్రైవర్స్ మొగిలిచర్ల ఆంజనేయులు, కోడె గురవయ్య, పెద్ది పిచ్చయ్య, కనకయ్య, నాగయ్య, నరసింహస్వామి, గోవిందచారి, జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు.