*మృతుని కుటుంబానికి చేయూతనిచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు*

పెబ్బేరు సెప్టెంబర్ 23 ( జనంసాక్షి ):   పెబ్బేరు మున్సిపాలిటిలోని అంబేద్కర్ నగర్ లో  కాంగ్రెస్ పార్టీ కార్యకర్త  శ్రీమతి పెంటమ్మ భర్త చిన్నకిష్టన్న గత వారం మరణించగా దశదిన కర్మ ఖర్చుల నిమిత్తం మండల కాంగ్రెస్ పార్టీ  తరుపున శుక్రవారం ఆమెకు  పదివేల రూపాయలను అందించారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కుటుంబానికి తోడుగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎద్దుల విజయ్ వర్ధన్ రెడ్డి, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు రంజిత్ కుమార్, 3వ వార్డ్ కౌన్సిలర్  పార్వతి మహేందర్ గౌడ్,జిల్లా బీసీ సెల్ నాయకులు రాములు యాదవ్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కారూపాకుల వెంకట్రాములు, టి.సత్యనారాయణ, టౌన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వల్లపురెడ్డి రణధీర్ రెడ్డి, సునీల్ కుమార్, వినయ్,హేమంత్ రెడ్డి, నెట్ రాము, ఖాసిం,మహిళలు జానమ్మ,ఉత్తేరమ్మ తదితరులు పాల్గొన్నారు.