మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న

నల్లబెల్లి జూన్ 14 (జనం సాక్షి):
మండలంలోని గొల్లపల్లె గ్రామానికి చెందిన కూస మల్లయ్య ప్రమాదవశాత్తు చెరువులో పడి సోమవారం మృతి చెందగా వారి భౌతికకాయాన్ని జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సందర్శించి నివాళులు అర్పించారు . మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోత్ సారంగపాణి, టిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పిండి కుమారస్వామి, సర్పంచ్ పూలమ్మ, సొసైటీ డైరెక్టర్ కొమురయ్య, మండల టిఆర్ఎస్ నాయకులు రాజ్ కుమార్, మామిండ్ల మోహన్ రెడ్డి, సాయిలు,సుధాకర్, సురేందర్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.