మెట్రోరైలు ప్రయాణం సౌకర్యం…సమయం ఆదా

a0ipe7obవిశాఖ,విజయవాడల్లో మంచి మెట్రో ప్రాజెక్టును తెస్తాం
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

న్యూఢిల్లీ, మార్చి 28 : మెట్రో ప్రయాణం సౌకర్యంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఢిల్లీ మెట్రోను చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటి నుంచో ఢిల్లీ మెట్రోను చూడాలనుకున్నట్లు చెప్పారు. మెట్రోతో సమయం ఆదా, పొల్యూషన్‌ ఉండదని బాబు తెలిపారు.
దేశంలో అధిక జనాభా దృష్ట్యా మరిన్ని మెట్రోలు రావాలని చంద్రబాబు ఆకాంక్షించారు. విశాఖ, విజయవాడల్లో అత్యున్నత ప్రమాణాలతో మెట్రో ప్రాజెక్టును తీసుకువస్తామన్నారు. అందుకోసం ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాలలో మెట్రోలను పరిశీలిస్తామని, ఢిల్లీ మెట్రోను కూడా మరోసారి పరిశీలిస్తామని చంద్రబాబు వెల్లడించారు.