మేడారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు..

వరంగల్ : సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు మేడారం జాతరకు వచ్చారు. సతీసమేతంగా సమక్క, సారలమ్మ గద్దెలను దర్శించుకుని మొక్కలు చెల్లించారు. ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడారు. గతంలో తాను అమ్మవార్లకు బంగారాన్ని పంపించే వాడినని, ఈసారి స్వయంగా రావడం జరిగిందన్నారు. ఉచిత విద్యను, హాస్టల్ లను ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉందని. ఆవిడ ఆశీస్సులు అందరిపై ఉండాలని, సమ్మక్క, సారలమ్మ త్యాగాన్ని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రాంతంలో వెనుకబడిన బడుగు బలహీన వర్గాలకు దివంగత ఎన్టీఆర్ పనిచేశారని, ఎన్టీఆర్ ఆశలను ముందుకు తీసుకెళుతామన్నారు.