యంత్ర రాజసేత కాళేశ్వర దేవాలయం లో శివపార్వతుల శాంతి కళ్యాణం – నిర్వాహకులు భూక్య బిక్షం మోతి

అశ్వరావుపేట, నవంబర్ 12( జనం సాక్షి )

అశ్వరావుపేట మండలంలోని శ్రీ శ్రీ యంత్ర రాజ సేత కాళేశ్వర స్వామి దేవాలయంలో 14వ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు శివపార్వతుల శాంతి కళ్యాణం జరుపబడునని ఆ దేవాలయ నిర్వాహకులు బుక్య బిక్షం, మోతే తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శాంతి శివ కళ్యాణం లో పాత్రులు కాగలరని కోరారు. భక్తులకు దంపతులు పీటల మీద కూర్చుని కళ్యాణం జరిపించే వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన వివరించారు.ఈ కార్యక్రమంలో బిర్రం వెంకటేశ్వరరావు, ఉప్పల మురళి, నల్లపు లీల ప్రసాద్, పొట్ట రాజులు, తదితర నాయకులు పాల్గొన్నారు.