యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సేవదళ్ చీఫ్ ఆర్గనైజర్ గా సామల రవీందర్…

భువనగిరి (. జనం సాక్షి ):–
భువనగిరి మున్సిపాలిటీ లోని రాయిగిరికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఢిల్లీ మధ్యప్రదేశ్ కర్ణాటక, రాష్ట్రాలలో టిఓటి ట్రైనింగ్ విజయవంతం చేసుకున్న సామల రవీందర్ ను యాదాద్రి భువనగిరి జిల్లా సేవా దళ్ చీఫ్ ఆర్గనైజర్ గా ఆల్ ఇండియా సేవాదళ్ ఇండియా సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సంగ్రామ్ తోడియా తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్, హైదరాబాదులోని గాంధీభవన్ లొ ఆల్ ఇండియా సేవాదళ్ చీఫ్ ఆర్గనైజర్ లాల్ జి ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన సామల రవీందర్ కు యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ జిల్లా సేవా దళ్ చీఫ్ ఆర్గనైజర్ గా నియమామిక పత్రాన్ని వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా సామల రవిందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని నా నియామాకమె నిదర్శమని అన్నారు. నియామకానికి సహకరించిన ఆల్ ఇండియా సేవాదళ్ చీఫ్ లల్ జి, సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు జితేందర్ మరియు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ డిసిసి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్, టిపిసిసి డెలిగేట్ మెంబర్ తంగేలపల్లి రవికుమార్లకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గ్రామ గ్రామాన సొనియాగాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. రాహుల్ గాంధీ ,ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జు ఖార్గే ,టి పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి, ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చే దిశగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి వాజిద్, ఏ నరసింహ, రమేష్, ఈ యాదగిరి, బత్తిని జితేందర్, తదితరులు పాల్గొన్నారు.