యువతిపై సామూహిక అత్యాచారం

ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపై పోలీసుల విచారణ
లక్నో,మే29(జ‌నం సాక్షి): ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ మే 13న కూరగాయల మార్కెట్‌కు వెళ్తుండగా..ఐదుగురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్‌ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన మహిళపై దాడి చేసి ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడినుంచి పరారయ్యారు. పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.