యూపీలో బాలిక నిర్భందంపై సుప్రీం ఆగ్రహం

లక్నో, ఉత్తరప్రదేశ్‌లో పదేళ్ల బాలికను పోలీసులు నిర్భందించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికను పోలీసులు నిర్భదించడాన్ని సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించింది. ఈ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై సోమవారంలోగా పూర్తి నివేదిక ఇవ్వాలని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.