యూపీ మంత్రి రాజాభయ్యా రాజీనామా

లక్నో : డీఎస్పీ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌ మంత్రి రాజాభయ్యా తన పదవికి రాజీనామా చేశారు. ప్రతాప్‌గఢ్‌ జిల్లాలో డీఎస్పీ సహా ముగ్గురి హత్య కేసులో రాజాభయ్యాపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో మంత్రి పదవికి రాజీనామా చేసిన భయ్యా రాజీనామా లేఖను ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌కు పంపారు.