య్యన్నపాత్రుడి అరెస్ట్‌పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు

మరావతి: మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులతో పోలీసులు ఆయన్ను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వంపై విమర్శలు చేస్తే అరెస్ట్‌ చేస్తారా?అని నిలదీశారు.”పోలీసులే ప్రతిపక్ష నేతలను కిడ్నాప్‌ చేసే దారుణ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే అయ్యన్నను అక్రమంగా అరెస్ట్‌ చేసి కక్ష సాధిస్తున్నారు. అసమర్థ, మాఫియా పాలకులను విమర్శించక ఏం చేస్తారు? అలా అయితే మంత్రులు, వైకాపా నేతలు చేసే వ్యాఖ్యలకు వారిని జీవితాంతం జైల్లో పెట్టాలి. ధైర్యం ఉంటే విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగన్‌ తప్పుల్లో పోలీసులు భాగస్వాములైతే భారీ మూల్యం చెల్లించక తప్పదు” అని చంద్రబాబు హెచ్చరించారు.