రంగ సాయి పేట లో పట్టణ ప్రగతి వరంగల్ ఈస్ట్, జూన్ 7(జనం సాక్షి):

వరంగల్ నగరంలోని 42వ  రంగ సాయి పేటలో మంగళవారం ఐదో రోజు పట్టణ ప్రగతి కార్యక్రమం కార్పొరేటర్ కు గుండు చెందన పూర్ణచంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ డివిజన్ లోని అన్ని వీధులలో పర్యటించి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారానికి తాను కృషి చేయనున్నట్లు వివరించారు అదేవిధంగా కొండ రైల్వే గేట్ ప్రాంతంలోని 39 ,32 ,41 ,38 మొదలైన డివిజన్లలో కూడా ఆయా డివిజన్ కార్పొరేటర్లు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉత్సాహంగా నిర్వహించారు
          ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ స్పెషలాఫీసర్ రవిరాజ్, CO ప్రవీణ్, బిల్ కలెక్టర్ సునీత, లైన్ మెన్ కర్ణాకర్, మున్సిపల్ జవాన్ ఖలీం, శానిటేషన్ సిబ్బంది మరియు మలేరియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.