రంజిత్ కుమార్ ను అభినందించిన మున్నూరు కాపు నాయకులు

వవరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతానికి చెందిన పార్వతి రంజిత్ కుమార్ ఆర్ ఆల్ ఇండియా సివిల్స్ లో 574 ర్యాంకు సాధించాడు ఈ సందర్భంగా మంగళవారం ఆయనను తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రంజిత్ కుమార్ అత్యంత ఉన్నతమైన ర్యాంకు సాధించడం ఎంతో అభినందనీయమని  బండి రమేష్ అన్నారు. రంజిత్ కుమార్ ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్వతి కృష్ణంరాజు ,మున్నూరు  కాపు పెద్దలు పూజారి సత్యనారాయణ పటేల్ ,అయిత రాజు, తోట సుధాకర్, వలి శెట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు