రద్దీ కూడళ్లలో నిఘా కెమెరాల ఏర్పాటు

కోదాడ: ఖమ్మం పట్టణంలోని క్రాస్‌రోడ్‌, బస్టాండ్‌ తదితర రద్దీ కూడళ్లలో ఏర్పాటు చేసిన నిఘా కెమెరాలను ఎస్పీ నవీన్‌ గులాటీ ఈ రోజు ప్రారంభించారు. వీటికి 3జీ టెక్నాలజీ జోడించి నేరస్థులను త్వరగా గుర్తించడం సాధ్యమవుతుందన్నారు. నల్గొండ జిల్లాలో దీన్ని పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టనున్నారు. దీని పనితీరును చూసి మున్ముందు మరికొన్ని ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.