రసాయన శాస్త్ర అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్10(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్ర అతిథి అధ్యాపక పోస్టుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ జి. మాధవి తెలిపారు.ఆమె మాట్లాడుతూ రసాయన శాస్త్రంలో మాస్టర్ డిగ్రీలో కనీసం 50 శాతం ఉత్తీర్ణత మార్కులు ఉండాలని తెలుగు మరియు ఆంగ్ల భాషలలో రసాయన శాస్త్రంలో బోధించుటకు ఆసక్తి గలవారు నేరుగా ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో తమ వివరాలతో కూడిన బయోడేటా మార్కుల ధ్రువపత్రాలు,ఇతర వివరాలు సమర్పించి ఈనెల 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.