రాంపూర్ లో ఓ వ్యక్తి దారుణ హత్య

జైనథ్ జనం సాక్షి ఆగస్టు 26                       జైనథ్ మండలంలో రాంపూర్ లో.
తేదీ 21.08.2022 రోజున సాయంత్రం అందాజ 17:15 గంటల, ప్రాంతంలో రాంపుర్-(టి) గ్రామంలో ఒక వ్యక్తి అయిన ఉట్లా రమేశ్ తండ్రి ఆనంద్ రావు, వయసు: 55 సం.లు, కులం: పెరిక, వృత్తి: వ్యవసాయం, నివాసం: రాముపూర్-(టి) గ్రామం, అనునతను కత్తి పొట్లతో హత్యకు గురి అయినాడు, ఇట్టి విషయం పై అతని కొడకు ఉట్లా శివ కుమార్ ఫిర్యాది ఇవ్వగా, జైనథ్ పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా, ఈ‌ రోజు ఉదయం 11:00 గంటలకు భోరజ్ ‘X’ రోడ్ లో ఇద్దరు అనుమానితులు తండ్రి, కొడుకు లను అదుపులో తీసుకొని విచారించగ, తమ పేర్లు A1) కోడిమెల ప్రభాకర్ తండ్రి గంగయ్య, వయసు: 44 సం’’లు , కులం: ము/కాపు, వృత్తి: వ్యవసాయం, అతని కొడుకు కొడుకు A2) కోడిమెల రాహుల్, తండ్రి: ప్రభాకర్,  వయసు: 19 సం’’లు, కులం: ము/కాపు, వృత్తి: వ్యవసాయం, ఇద్దరి నివాసం: రాంపుర్-(టి) గ్రామం, వీళ్ళు ఇద్దరు పాత కక్ష్యలు  మనస్సు లో పెట్టుకొని, మృతుని ఎలాగైనా చంపుతానని కథనం రచించి,  A1) & A2) కథనం ప్రకారం తేదీ 21.08.2022 రోజున సాయంత్రం అందాజ 17:15 గంటల ప్రాంతంలో మృతుకు తన ఏడ్ల బండి పట్టుకొని చేను నుంచి వస్తుండగా, మార్గ మద్యలో  రాంపుర్-(టి) గ్రామం లోని C C రోడ్డు పైన, A1) & A2) లు రెండు కత్తులతో మృతుడి పైన దాడి చేసి హత్య చేసినార ఒప్పుకొనడం జర్గింది, వాళ్ళు వాడిన రెండు కత్తులను, వాళ్ళు వేసుకోనున్న  బట్టలను మరియు బైక్ను స్వాదిన పర్చి,   ఈ రోజు సాయంత్రం 03:00 గంటలకు A1) & A2) లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చడం జర్గుతుంది,