రాజీనామాల ఆమోదం కోసమే వచ్చాం: మేకపాటి

న్యూఢిల్లీ,మే29(జ‌నం సాక్షి):   ప్రత్యేక హోదా ఇవ్వనందువల్లే ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయిందని వైసీపీ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనంగా తమ పార్టీ ఎంపీలందరూ రాజీనామా చేశామని, స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలు ఆమోదించాలని కోరతామని మేకపాటి చెప్పారు. ఏపీకి ¬దా ఇస్తే యువతకు ఉపాధి లభించేదని అభిప్రాయపడ్డారు. ఉప ఎన్నికలు వస్తే ప్రజలు వైసీపీనే గెలిపిస్తారరి ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక¬దా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని మరో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా స్పీకర్‌ను కోరతామన్నారు. ఉపఎన్నికల్లో ప్రజలు తమను భారీ మెజార్టీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.