రానున్న 24 గంటల్లో వర్షాలు

విశాఖ : వాయువ్య బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని విశాఖలోని తుఫాన్‌ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. మరొవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడి ఉందని దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని, ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.