రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం.

జనం సాక్షి జెడ్చర్ల టౌన్ :  రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యత ఇస్తామని ఎవరు అధైర్య  పడాల్సిన అవసరం లేదని జడ్చర్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జనంపల్లి అనిరుద్ రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం ఈ మేరకు ఆయన జడ్చర్ల నియోజకవర్గం లోని బాలానగర్ మండలం హెమాజీ పూర్, పెద్ద రేవల్లి గ్రామాలలో
రాహుల్ గాంధీ వరంగల్ సభలో ప్రవేశపెట్టిన వరంగల్ డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలు దొందూదొందే నని, అవకాశ రాజకీయాలకు మారుపేరుగా మారాయని విమర్శించారు. టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, కబ్జాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు జడ్చర్లలో సర్వసాధారణంగా తయారయ్యాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో వాడ వాడ తిరుగుతూ ప్రజలకు రైతు డిక్లరేషన్ గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పాలన మండల అధ్యక్షులు ఆది రమణారెడ్డి, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.