రాబోయే రోజుల్లో బిజెపిలోకి మరిన్ని చేరికలు మాజీ మంత్రి చంద్రశేఖర్.

 

మర్పల్లి ఆగస్టు 31 (జనం సాక్షి) మర్పల్లి మండల కేంద్రంలోని గుండ్ల మార్పల్లి, పట్లూరు గ్రామాలకు చెందిన మాజీ ఎంపీటీసీ అంజన్న, టీఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ బోయిని శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గోపాల్, మధు పెద్దోళ్ల, రవికుమార్ గుప్తా, సతీష్, రమేష్, రాధాకృష్ణ, జనార్దన్, మాజీ మంత్రి, బిజెపి నేత డా. ఏ. చంద్రశేఖర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు నరేంద్రమోడీ నాయకత్వం లో గల్లీ నుండి ఢిల్లీ వరకు కాషాయ జెండా ఎగురావేయాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కేంద్ర ప్రభుత్వం చేసినవే ఉన్నాయని గ్రామాలలో ప్రజలు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మేస్థితిలో లేరని ముఖ్యంగా టీఆర్ఎస్ నియంత్రుత్వ, నిజాం పాలనను బొందపెట్టాలని, కుటుంబ పాలన నుండి విముక్తి ని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేసారు. రాబోవు రోజుల్లో వికారాబాద్ గడ్డ మీద కాషాయ జెండా ఎగురావేయడం కాయం అని ధీమా వక్తం చేసారు. నూతనంగా పార్టీలోకి వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి, మార్పల్లి మండల అధ్యక్షులు మల్లేష్, ఇంచార్జ్ శ్రీనివాస్ గౌడ్, ఎస్సి మోర్చా జిల్లా అధ్యక్షులు నవీన్, జైపాల్, మల్లేష్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.