రామకృష్ణాపురంలో గ్రామం లో శివ గణేష్ ఉత్సవ వేడుకలు చేయనున్నారు

 

చింతకాని , ఆగస్టు 31(జనం సాక్షి)
చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురంలో గ్రామం లో శివ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యం లో 8 అడుగుల మొట్టమొదటిసారి పర్యావరణ హిత బట్టి గణపతిని ప్రతిష్టించి నవరాత్రి వేడుకలు చేయనున్నారు. ఈ సందర్భగా కమిటి సభ్యులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల ఉత్సవాలను ప్రజలందరూ పాల్గొనవలసిదిగా కోరారు. ప్రజలందరూ పర్యావరణ హితమైన మట్టి బొమ్మలనే పూజించమని చెప్పారు . ఈ ఉత్సవ కమిటీ అధ్వర్యంలో ఇక నుండి వినాయక ఉత్సవాలు జరుగుతాయని ,పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను ఏర్పాటు చేసుకొని పూజలు చేయాలని వారు అన్నారు