రామచంద్రుడు,నెహ్రూ నాయకులను శాలువాతో సన్మానించిన – కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్యా కాశిరాం నాయక్.

డోర్నకల్/కురవి, నవంబర్ 17,జూన్ సాక్షి న్యూస్:
కురవి మండలం లింగ్యాతండా గ్రామంలో శుక్రవారం డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు అభ్యర్థి డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత
మాలోత్ నెహ్రు నాయక్ ను మర్యాదపూర్యకంగా కలిసి శాలువాతో సన్మానించిన డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్యా కాశీరాం నాయక్, ఉమ్మడి గొల్లచెర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు.ఈ సందర్భంగా ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు భూక్యా కాశీరాం నాయక్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాలోత్ నెహ్రూ ఎన్నికలో సహకరించడంతో డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు బానోత్ కోబాల్ నాయక్, బానోత్ శ్రీను నాయక్, భూక్య రవి నాయక్, గుగులోతు రవికుమార్, బానోతు రాము, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు