రాయచూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ను సన్మానించిన శేషంపల్లి తిమ్మారెడ్డి

మల్దకల్ జూలై 22 (జనంసాక్షి) కర్ణాటక లోని రాయచూర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా డి.అచ్యుత రెడ్డి నియామకం పట్ల మల్దకల్ మండల సింగిల్ విండో అధ్యక్షుడు శేషంపల్లి తిమ్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం రాయచూరు వెళ్లి అచ్యుత రెడ్డిని కలిసి ఆయనకు శాలువా, పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో మల్దకల్ వైస్ ఎంపీపీ పెద్దవీరన్న,టిఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు.
Attachments area