రాష్టాన్ని మద్యం మాఫియా ఏలుతోంది : రాఘవులు

నల్గొండ: మద్యం సిండికేట్ల పై ఏసీబీ నివేదిక లోపభూయిష్టంగా ఉందని సీపీఎం రాష్ట్ర
కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన
మాట్లాడారు. అవినీతికి రక్షణగా, ప్రభుత్వ పెద్దలను కాపాడేలా ఏసీబీ నివేదిక ఉందని
ఆరోపించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ డిసెంబరు 3న రాష్ట్ర వ్యాప్త
ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. రాష్ట్రాన్ని మద్యం మాఫియా
ఏలుతోందనే విషయం కేంద్ర మంత్రి కిషోర్‌చంద్రన్‌ లేఖ రుజువు చేస్తోందని
తెలిపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఏ పార్టీ ముందస్తు ఎన్నికలు కోరుకోవడం
లేదనిఆయన వ్యాఖ్యానించారు.