రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కోతలకు నిరసనగా నేడు తెరాస రాస్తారోకోలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ కోతలకు నరిసనగా సోమవారం తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో రాస్తారోకోలు చేయాలని పార్టీ కార్యకర్తలు, ప్రజలకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రభుత్వ అసమర్థ విధానాల వల్లే రాష్ట్రంలో విద్యుత్‌ సంక్షోభం తలెత్తిందన్నారు. ఇప్పటికే  వర్షాలు లేక అల్లాడుతున్న తెలంగాణ ప్రాంత రైతాంగం అస్తవ్యస్త విద్యుత్‌ సరఫరాతో మరింత నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణంమై ప్రభుత్వం స్పందించి రైతులకు, పరిశ్రమలకు నరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు.