సినీ సిటీకి హైదరాబాదును రాజధానిగా తీర్చిదిద్దాలి

`డీటెయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్ధం చేయండి
` 14న గద్దర్‌ సినిమా అవార్డులు అంగరంగ వైభవంగా నిర్వహించాలి
` సినిమా రంగ సమగ్ర అభివృద్ధి సబ్‌ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్‌(జనంసాక్షి):సినిమా సిటీకి హైదరాబాద్‌ నగరాన్ని రాజధానిగా మార్చేందుకు అవసరమైన డీటెయిల్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం, మంత్రుల సబ్‌ కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్క సమాచార శాఖ కమిషనర్‌, ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ అధికారులను ఆదేశించారు. మంత్రులు, సబ్‌ కమిటీ సభ్యులైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. హైదరాబాదును సినిమా సిటీగా అభివృద్ధి చేసి, దేశ, విదేశాల నుంచి సినిమా రంగ ప్రముఖులను ఆకర్షించడమే ప్రభుత్వ లక్ష్యం అని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సినిమా షూటింగ్‌ చేయాలంటే పోలీసు శాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపల్‌ శాఖ వంటి వివిధ శాఖల నుంచి విడివిడిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది, ఫలితంగా సినీ పరిశ్రమ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు, ఈ సమస్యను పరిష్కరించాలని పెట్టాలని సబ్‌ కమిటీ నిర్ణయించింది. వివిధ శాఖల నుంచి ఇవ్వాల్సిన అనుమతులను ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ లో ఒక అధికారిని నియమించి వారి ద్వారా అన్ని శాఖల నుంచి అనుమతులు త్వరితగతన ఇప్పించేలా సింగిల్‌ విండో పద్ధతిని ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాల్లో షూటింగులు జరగడం మూలంగా పర్యాటక రంగం అభివృద్ధికి అవకాశం ఉందని తెలిపారు. సినిమా థియేటర్లలో క్యాంటీన్ల ద్వారా విక్రయిస్తున్న తినుబండారాలు ఇతర వస్తువులు అత్యధిక రేట్లకు విక్రయిస్తున్నారు సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ధరలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫిలిం డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ కు గతంలో రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాలు మంజూరు చేసింది, ప్రస్తుతం ఆ భూమి పరిస్థితి వాటి వివరాలను వచ్చే సమావేశం నాటికి తీసుకురావాలని సబ్‌ కమిటీ అధికారులను ఆదేశించారు. సినీ కార్మికుల కోసం నిర్మించిన చిత్రపురి కాలనీ పై ఏర్పాటుచేసిన కమిటీనీ వచ్చే సమావేశానికి పిలిపించాలని సూచించారు. ఈనెల 14న ఏర్పాటు చేస్తున్న తెలంగాణ గద్దర్‌ ఫిలిం అవార్డ్స్‌ ఫంక్షన్‌ ను న భూతో.. న భవిష్యత్తు అన్నట్టుగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ రంగ ప్రముఖుల అందరిని ఆహ్వానించాలని, తెలుగు సినిమాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సినీ నటులను గుర్తించి ఆహ్వానించాలని డిప్యూటీ సీఎం అధికారులకు సూచించారు. సమావేశంలో %ఖీసష% చైర్మన్‌ దిల్‌ రాజు, హోం శాఖ స్పెషల్‌ సిఎస్‌ రవి గుప్తా, సమాచార శాఖ కమిషనర్‌ హరీష్‌, ఎఫ్డిసి డైరెక్టర్‌ కిషోర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు