రాష్ట్రంలో రాక్షసపాలన

వైసిపికి బుద్ది చెప్పడం ఖాయమన్న జివి
గుంటూరు,సెప్టెంబర్‌1 జనం సాక్షి   ªూష్ట్రంలో రాక్షస పాలన రాజ్యమేలుతోందని టిడిపి నేత, ఎమ్మెల్యే జివి ఆంజనేయులు అన్నారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు తలపెట్టిన యువగళం పాదయాత్ర రెండు వందల రోజుకు చేరుకున్న సందర్భంగా పార్టీకి మంచి జోష్‌ వచ్చిందన్నారు. లోకేష్‌ బాబు తలపెట్టిన యువ గళం పాదయాత్ర రెండు వందల రోజుల్లో రెండువేల కిలోవిూటర్లపైబడి చేరుకుందని అన్నారు. సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి రాకముందు ముద్దులు వచ్చిన అధికారానికి వచ్చిన తరువాత గుద్దులు గుద్దుతున్నట్లుగా సాగుతోందని అన్నారు. రేపటి నుండి నలభై రోజుల పాటు ఈ యాత్రలు సాగుతాయని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హావిూలు నెరవేర్చడంలో సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి విఫలయ్యారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెబుతారని అన్నారు.