రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా బీజేపీ అగ్రనేత ఎల్‌.కే. అద్వానీ, పంజాబ్ సీఎం ప్రకాశ్‌సంగ్‌ బాదల్‌, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ సహా 9 మంది పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఎన్ గోపాలస్వామి, హరీశ్ సాల్వే సహా మరో 20 మందికి పద్మ భూషణ్ పురస్కారాలు అందజేశారు. తెలంగాణకు చెందిన మిథాలీరాజ్, పీవీ సింధు సహా 75 మంది పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. రాష్ట్రపతిభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అరుణ్‌ జైట్లీ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.