రాష్ట్ర జాయింట్ సెక్రెటరీగా చందా గోపి నియామకం.

కేసముద్రం సెప్టెంబర్ 2 జనం సాక్షి / మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా మండలంలోని గాంధీనగర్ కు చెందిన చందా గోపిని నియమించినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య తెలిపారు.ఈ మేరకు శుక్రవారం  హైదరాబాదు లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో  జరిగిన సమావేశంలో ఆయన నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా చందా గోపి మాట్లాడుతూ… ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలో ఇద్దరికీ అవకాశం లభించగా దానిలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కటకం పెంటయ్య జాయింట్ సెక్రెటరీగా నాకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు.గత 20 సంవత్సరాలుగా జిల్లాలో మున్నూరు కాపుల అభివృద్ధికి  చేస్తున్న  సేవలకు గుర్తింపుగా ఈ నియామకం జరిగిందన్నారు.ఈ నియమకానికి కృషి చేసిన రాజ్యసభ సభ్యులు ,మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్ర, అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ పుటం పురుషోత్తం,రాష్ట్ర నాయకులు వద్దిరాజు కిషన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ ,కటకం పెంటయ్య ,ఖమ్మం జిల్లా అధ్యక్షులు పారా నాగేశ్వరరావు, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు నీలం శ్రీనివాస్ ,జిల్లా ప్రధాన సలహాదారు తుంపిల్ల శ్రీనివాస్,వరంగల్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల రవికుమార్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు పెండల సంపత్ పటేల్, ములుగు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి పటేల్, జిన్నారెడ్డి శ్రీనివాస్,మద్దెల రమేష్ , కమటం శ్రీనివాస్, రావుల మురళి ,కమటం స్వామి ,సింగంశెట్టి ఏకాంతం ,పిట్టల శ్రీకాంత్ మరియు జిల్లా కమిటీ ,అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.