రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 17 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో శనివారం తెలంగాణ రాష్ట్ర జేఏసీ రాష్ట్ర నాయకులు పిడమర్తి రవి ఆదేశానుసారం జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు సలికే పోగు తిప్పన్న రాజు ఆధ్వర్యంలో కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా తిప్పన్న రాజు మాట్లాడుతూ
నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని పెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటం కు పాలాభిషేకం చేశామని,తెలంగాణ రాష్ట్ర సముదాయ భవనమైన సెక్రటేరియట్ కు భారత సామాజిక దార్శనికుడు మహామేధావి డా. బి ఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయడం తెలంగాణ ప్రజలందరికీ గర్వకారణం అని,ఈ నిర్ణయం భారతదేశానికే ఆదర్శం అని, భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహనీయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదని, సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో సబ్బండ వర్గాలను సమన్నత స్థాయిలో నిలుపుతూ కొనసాగిస్తున్న స్వయం పాలన రాష్ట్రం ఏర్పాటయిన అతికొద్ది కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలవడం వెనక డా.బి.ఆర్ అంబేద్కర్ మహాశయుని ఆశయాలు ఇమిడి వున్నయని, రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యిందని, ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనారిటీ,మహిళా వర్గాలతో పాటు పేదలైన అగ్రకులాల ప్రజలకు కూడా మానవీయ పాలన అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ స్పూర్తిని అమలు చేస్తున్నదని, మహానుభావుడు కలలుగన్న భారతదేశంలో భిన్నత్వంతో కూడిన ప్రత్యేక ప్రజాస్వామిక లక్షణం ఉన్నదని,ఫెడరల్ స్పూర్తి ని అమలు చేయడం ద్వారా మాత్రమే అన్ని వర్గాలకు సమాన హక్కులు అవకాశాలు కల్పించబడుతాయనే స్పూర్తి మమ్మల్ని నడిపిస్తున్నదని,భారత దేశ ప్రజలు కుల, మత, లింగ, ప్రాంతాల వివక్ష లేకుండా అన్ని వర్గాలు సమానంగా గౌరవించబడి, అందరికీ సమాన అవకాశాలు కల్పించబడడమే నిజమైన భారతీయతని,అన్ని రంగాల్లో ముందుకుపోతూ, అనతి కాలంలోనే దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం అని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మహాశయుని పేరును రాష్ట్ర సెక్రటేరియట్ కు పెట్టడం ద్వారా మరోసారి దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని ఆయన ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, ఆర్.దేవరాజు,గోపాల్, మహేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.