రుణదాతల వేధింపులకు యవతి బలి

అవమానకరంగా వేధించడంతో ఆత్మహత్య

విజయవాడ,జూలై28(జనంసాక్షి ): నందిగామలోని రైతుపేటలో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్‌ పూర్తి చేసి ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించిన జాస్తి హరిత వర్షిణి (17)ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రునదాతల వేధింపులతో పాటు, ఇష్టం వచ్చినట్లుగా మానసికంగా హింసించడంతో ఆము ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వేధింపులకు తాళలేక ఆమె తనువు చాలించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… హరిత వర్షిణి తండ్రి బ్యాంక్‌లో తీసుకున్న అప్పు… సమయానికి చెల్లించలేదని బ్యాంకు అధికారులు ఇంటికి వచ్చి అవమానకరంగా మాట్లాడటంతో మనస్థాపం చెందిందని తెలిపారు. మన పరువు పోయిందని వర్షిణి తన దగ్గర ఎంతో బాధ పడిరదని, ఇంట్లో తాము ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని మృతిరాలి తల్లి బోరున విలపించారు. ఉన్నత చదవులు చదువుకోలేక ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో వర్షిణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.