రుద్రంగి ఎస్ఐ ని కలిసిన మానాల ప్రజాప్రతినిధులు

రుద్రంగి ఆగస్టు 23 (జనం సాక్షి)
రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రభాకర్ ను మానాల ప్రజాప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… నూతనంగా రుద్రంగి మండల ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ప్రభాకర్ కు రుద్రంగి మండల టిఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతున్నామన్నారు అలాగే ప్రజల పోలీస్ శాఖ పరమైన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి మండల ప్రజలకు సహకరించాలని ఎస్సైని కోరారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పీసరి చిన్న భూమయ్య, కమ్మర్పెల్లి మాజీ వైస్ ఎంపీపీ బాదనవేని రాజారాం రుద్రంగి మండల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దేగవత్ తిరుపతి,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తిక్క భూమన్న,మానాల టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నాయిని రాజేశం తదితరులు పాల్గొన్నారు.