రూ.లక్షల బంగారం కాజేసిన బ్రాంచి మేనేజర్‌

మెదక్‌: పటాన్‌ చెరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ బ్రాంచిలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఖతాదారులు తనఖా పెట్టిన రూ.28లక్షల విలువైన బంగారాన్ని బ్రాంచి మేనేజర్‌ శ్రీధర్‌ స్వాహా చేసినట్లు యజమాన్యం గుర్తించింది. ఏరియా మేనేజర్‌ ఫిర్యాదు మేరకు బ్రాంచి మేనేజర్‌ శ్రీధర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.