రూ.20లక్షల పరిహారం చెల్లించాలి: వైగో..

తమిళనాడు: శేషాచలం ఎన్ కౌంటర్ మృతుల కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం చెల్లించాలని ఎండీఎంకే అధినేత వైగో డిమాండ్ చేశారు. ఏపీ జైళ్లలో ఉన్న మా కూలీల బాధ్యత తమిళనాడు ప్రభుత్వానిదేనని వైగో పేర్కొన్నారు. రాష్ట్రమంత్రి బొజ్జల సినిమా డైలాగులు చెబుతున్నారని, చంద్రబాబు వ్యాఖ్యలు మానవత్వానికి దూరంగా ఉన్నాయన్నారు. మరో వైపు ఎన్కౌంటర్కు నిరసనగా చిత్తూరు కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. వైగో హెచ్చరికల నేపథ్యంలో ఆయన్ని చిత్తూరు జిల్లా సరిహద్దులోనే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వ్యూహం రచించారు. గుడిపాల చెక్పోస్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు వైగో రాయవేలూరులో కార్యకర్తలతో సమావేశమయ్యారు. మరోవైపు వైగోకు మద్దతుగా తమిళనాడులోని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.