రెండవ వార్డులో బీ.ఆర్.ఎస్. ఎన్నికల ప్రచారం

రెండవ వార్డులో బీ.ఆర్.ఎస్. ఎన్నికల ప్రచారం

క్యాతనపల్లి మున్సిపాలిటీ రెండో వార్డు జ్యోతినగర్ జోడి పంపుల ఏరియాలో బుధవారం వార్డు కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రెండో వార్డ్ కు ఎల్ఈడి స్క్రీన్ వ్యాన్ రాగా, చెన్నూరు నియోజకవర్గంలో, క్యాతనపల్లి మున్సిపాలిటీ లో ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు చూపిస్తూ, తెలియజేయడం జరిగింది, అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే మనం చెన్నూరు ఎమ్మెల్యేగా బాల్క సుమన్ కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు కౌన్సిలర్ పుల్లూరు సుధాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు వేముల వెంకటేష్, ఓసిఎం సతీష్, ఎల్లయ్య, కొమ్ము శ్రీనివాస్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.