రెండోరోజూ కొనసాగిన బాబు పర్యటన

చిత్తూరు,జూలై7(జనంసాక్షి):ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు గురువారం పర్యటన కొనసాగుతోంది. నగిరి ప్లలెలో నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి ఇంటికి వెళ్లి అల్పాహారం సేవించారు. అనంతరం కలికిరిలోని ఓ కళ్యాణ మండపంలో రాజంపేట పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సవిూక్ష నిర్వహించారు. ముందుగా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ సవిూక్ష ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పుంగనూరు, చివరగా మదనపల్లి నియోజకవర్గం సవిూక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.